సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్.. ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదు,
మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచే లీకేజీలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ పునాదుల నుంచే సరిగా పనులు జరగలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ వారి ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదని. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కట్టారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ ను రిపేర్ చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరంపై మంత్రి కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని అన్నారు.