యూనివర్సిటీలను బ్రష్టు పట్టించిన కేసీఆర్

సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రభుత్వ యూనివర్సిటీలను బ్రష్టు పట్టించింది కేసీఆర్ అని ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూలో వాటర్ కరెంట్ కొరత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓయూ లో వేసవి సెలవుల సందర్భంగా ఓయూ అధికారులు ఒక సర్కులర్ జారీ చేశారు. ఆ సర్కులర్ తప్పుపడుతూ కెసిఆర్ ట్విట్టర్    చేశారు 9 సంవత్సరాలు కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించి ఏ రోజు కూడా ఓయూ గురించి మాట్లాడని కెసిఆర్ ఈరోజు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం పెంచింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు, ఓయూ రిజిస్టర్ పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ అవుతున్న విద్యార్థుల కోసం నీటి కొరత విద్యుత్ కొరత ఉండదని ఈరోజు సర్కులర్ జారీ చేశారు. కెసిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు 17 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టిఆర్ఎస్ పార్టీ గెలవదు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *