సిరాన్యూస్, ఆదిలాబాద్
పూలాజీ బాబా ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ : కేశవ్ దాదా
పరమహంస సద్గురు పూలాజి బాబా ధ్యాన మందిర నిర్మాణానికి ఆదిలాబాద్ పట్టణ పరిసరాల్లో గల మా వాళ్ల శివారి ప్రాంతంలో గల సర్వే నంబర్ ఒక 181/11 లో ఒక ఎకరం భూమి స్థలంలో శ్రీ సిద్ధ యోగ మహాపీఠం సిద్దేశ్వర సంస్థాన్ పట్నాపూర్ అధ్యక్షులు కేశవ్ దాదా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజు బాయి గంగన్న పట్టేదారు శ్రీ జాదవ్ సోనే సింగ్ ధ్యాన మందిర నిర్మాణానికి ఒక ఎకరం భూమి విరాళంగా ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ ధ్యాన మందిర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్ గురునులే, సుకుమార్ పేట్కులే మిగతా కమిటీ సభ్యులంతా కలిసి ధ్యాన మందిర నిర్మాణానికి బాధ్యత చేపట్టడడం జరిగిందన్నారు. బాబా ధ్యాన, జ్ఞాన బోధనలను ప్రపంచానికి తెలియజేయడానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. మనమంతా కలిసి రాబోయే రోజుల్లో ఇక్కడ భవ్యమైన ధ్యాన మందిరాన్ని నిర్మించుకుందామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పట్నాపూర్ సంస్థాన్ గౌరవాధ్యక్షులు వామన్ ఇంగ్లే, తుకారం సార్, ధ్యాన మందిర కమిటీ సభ్యులతో పాటు పరిసర ధ్యాన మందిర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.