సిరా న్యూస్,ప్రకాశం;
ప్రకాశంజిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కారులో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో ప్లాన్ చేసి కారులో తరలిస్తున్న కేజీ 280 గ్రాముల బంగారంతో పాటు 58వేల రూపాయిల నగదు, బంగారం తరలిస్తున్న కారు, ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారుగా 90 లక్షల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. చెన్నై నుండి నల్గొండకు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన బంగారాన్ని పోలీసులు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నారు.
================