సిరా న్యూస్, పెంబి:
పట్టుదలతో చదివితేనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం..
-ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
విద్యార్థులంతా పట్టుదలతో, కస్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలను సులువుగా సాధించవచ్చని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో కలెక్టర్ అశ్విన్ తో కలసి రూ. 3.5 కోట్లతో నిర్మంచిన కేజీబీవీ పాఠశాల భవనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన కారయక్రమంలో పాల్గొని మాట్లాడారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ… యాత్రకు నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ఖానాపుర్, పెంబి మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, సల్ల స్వప్నీల్ రెడ్డి, నాయకులు తులాల శంకర్, గుగ్గిల భుమెష్, సాగే అశోక్ రావు, న్యాయ వాది సల్ల ప్రశాంత్ రెడ్డి , మల్లేపల్లి స్వామి, తొకల మహేందర్ రెడ్డి, సల్ల దేవేందర్ రెడ్డి, స్కూల్ స్పెషల్ ఆఫీసర్ వీణ, తదితరులు పాల్గన్నారు.