సిరా న్యూస్,ఖానాపూర్
ఖానాపూర్లో విధులను బహిష్కరించిన న్యాయవాదులు
సిద్దిపేట న్యాయవాది రవి కుమార్ పై జరిగిన పోలీసుల దాడికి నిరసనగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణములో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈసందర్బంగా ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మంత్రరాజం సురేష్ మాట్లాడారు. ఇలాంటి దాడులు మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మంత్రరాజం సురేష్, ప్రధాన కార్యదర్శి నేరేళ్ల సత్యనారాయణ, బక్కశెట్టి కిషోర్, వెంకట మహేంద్ర,కిషోర్ నాయక్, కమలాకర్, రాజలింగం, షేక్అంజర్,శివకుమార్,రవి కుమార్,షబ్బీర్ పాషా,సలీం ఖాన్,సిలివేరి వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.