khanapur bustand: బస్సులు లేక ఇబ్బంది

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బస్సులు లేక ఇబ్బంది
* ప‌ట్టించుకోని ఆర్టీసీ అధికారులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఖానాపూర్ నుండి నిర్మల్ వెళ్లడానికి కొన్ని గంటల తరబడి ప్రయాణికులు వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఖానాపూర్ బస్టాండ్ నుండి నిర్మల్ వెళ్లే దారిలో విద్యానగర్లో చిన్న బస్సు షెల్టర్ ఉంది. అక్కడ ఈ ఫ్రీ బస్ లేకముందు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ విద్యానగర్ బస్ స్టాప్ నుండి కూడా నిర్మల్‌కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు బస్టాండ్ వెళితే గాని సీట్లు దొరకడం లేదు.దొరికిన ఓన్లీ ఆడవారికి మాత్రమే. మగవారు డబ్బులు ఇచ్చి మరి ప్రయాణం చేస్తున్నారు. అయినా కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ఆడవారు అవసరం ఉన్నా లేకున్నా బస్సుల్లో ఫ్రీ కాబట్టి వెళ్తున్నారు. అలాగే ఖానాపూర్ నుండి ఇంతకుముందు నిర్మల్ కు ప్రతి 15 నుండి 30 నిమిషాల మధ్యలో బస్సులు వస్తూ ఉండేవి. అలాంటివి ఇప్పుడు ప్రజలు గంటల తరబడి నిర్మల్ వెళ్లడానికి వేచి చూడాల్సిన దరిద్రం పట్టుకుంది .అలాగే విద్యానగర్ బస్ స్టాప్ లో అసలు ఆపడం లేదు. ప్రజలు విద్యానగర్ నుండి బస్టాండ్ వరకు వెళ్లడానికి ఆటో చార్జ్ 30 రూపాయలు పెట్టి మరి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇంకొక పది రూపాయలు అంటే 40 రూపాయలు పెట్టుకుంటే ఖానాపూర్ నుండి నిర్మల వరకు వెళ్లవచ్చు. అలాంటిది ఈ ఫ్రీ బస్ వల్ల ఇలాంటి ప్రయోజనం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఖానాపూర్ నుండి నిర్మల్‌కు ప్రతి 15 నుండి 20 నిమిషాలకు ఒక బస్సు ఉండాలని ఉండేటట్టు నాయకులు చూస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదు. కనీసం ఇప్పటికైనా నాయకులు జోక్యం కలిగించుకొని ఆర్టీసీ బస్సులను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *