ఖానాపూర్, సిరా న్యూస్
నెగ్గిన అవిశ్వాస తీర్మానం
బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ అహ్మద్ లపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కూడా వ్యతిరేక ఓటు వేయడం గమనార్హం. అవిశ్వాసానికి ఓటేసిన వారిలో రాజూరా సత్యం, అఫ్రిన్ ఖానాం, కిషోర్ నాయక్, ఫౌజియా బేగం, బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు విజయలక్ష్మి, నకిమి లతచ ్ావలి పంతొప్, బీజేపీ కౌన్సిలర్లు నాయిని స్రవంతి, స్వతంత్ర కౌన్సిలర్ కుర్మ శ్రీనివాస్ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. అవిశ్వాసంపై హైకోర్టు స్టే తొలగించడంతో అవిశ్వాసం నిర్వహించారు.