Khushboo Gupta: 50 ఆశ్రమ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత : ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా

సిరాన్యూస్, ఉట్నూర్
50 ఆశ్రమ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత : ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా

ఉమ్మడి ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలలో 50 ఆశ్రమ పాఠశాలలు పదో తరగతి పరీక్ష ఫలితాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడారు. ఇదే మాదిరిగా వచ్చే విద్యా సంవత్సరం లో ఉమ్మడి అదిలాబాద్ ఆశ్రమ పాఠశాలలు అన్నీ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా, నాణ్యమైన విద్యను అందించేలా, ప్రతీ ఆశ్రమ పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *