నాకుటుంబాన్ని చంపేయండి

ముద్రగడ
సిరా న్యూస్,ఏలూరు;
ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలతో తనను, తన కుటుంబాన్ని బూతులు తిట్టిస్తున్నారని, దాని బదులు తమ కుటుంబాన్ని చంపేయాలని కోరారు. మొత్తం తమ కుటుంబంలో ఏడుగురు ఉన్నారని, అందర్నీ చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. సవాల్ కి కట్టుబడి ఉన్నాను కాబట్టే తన పేరు మార్చుకున్నానని చెప్పారాయన.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని గుర్తు చేశారు. సినిమాలు ఆపెయ్ పవన్.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారని, పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలని కోరారు ముద్రగడ. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, వెంటే వాటిని ఆపేయాలన్నారు.
==========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *