సిరాన్యూస్,బేల
విద్యార్థులు మేధావులుగా ఎదగాలి
* పలువురు వక్తలు
* ఘనంగా సైన్స్ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక కీర్తన డిగ్రీ కాలేజ్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్ సేవలను విద్యార్థులకు వివరించారు. రామన్ సర్ ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మేధావులు గా ఎదగాలని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా గెడం ప్రవీణ్ , భౌతిక శాస్త్ర విభాగం అధిపతి పుష్ప, సీనియర్ అధ్యాపకులు ఆమోల్, సాగర్, కిష్ట రెడ్డి, సంజీవ్, బిందు, ప్రియాంక, సౌందర్య , విజయ, బోధనేతర సిబ్బంది అనికేత్, అహ్మద్ ఖాన్, అర్చన పాల్గొన్నారు