సిరాన్యూస్, జైనథ్
కథల పోటీల్లో ఉత్తమ కథా రచయితగా తల్లెల కీర్తి
ఉభయ తెలుగు రాష్ట్రల విద్యార్థులకు నిర్వహించిన కథల పోటిల్లో ఉత్తమ కథా రచయితగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తల్లెల కీర్తి ఎంపికైంది. ఆమెను ఉపాధ్యాయులతోపాటు వారి కుటుంభ సభ్యులు గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించి శభాష్ అంటూ కితాబిచ్చారు. ఇలాగే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, అందరి మన్ననలు అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు.