సిరా న్యూస్, అనంతపురం
విలేకరులపై దాడులు చేస్తే చర్యలు
* శ్రీకృష్ణ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశాం
* ఈ ఘటనలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు
* జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్
విలేకరులపై ఎవరైనా దాడులు చేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఎంక్వయిరీ చేపడుతామని, పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద కూడా వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు.ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి బైండోవర్ చేశామని తెలిపారు. పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత అని, వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తామని తెలిపారు. విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా, బెదిరించినా వెంటనే మాకు సమాచారం అందిస్తే ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు.