సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలిస్సు స్టేషనే పధిలో అబ్దుల్లా అనే వ్యక్తి రెచ్చిపోయాడు, ఎంఎం పహడి వద్ద మామ, బావమరిది పై మటన్ కట్ చేసే కత్తితో దాడి చేసాడు. విచక్షణారహితంగా కత్తి తో పొడిచిన ఈ ఘటనలో ఆ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన అబ్దుల్లాను స్థానికులు చితకబాదారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.