సిరా న్యూస్,జగ్గయ్యపేట
పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆమె ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటిసారిగా దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. కోదాడ హుజూర్నగర్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.