Kodandaram: రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం : ప్రొఫెసర్ కోదండరాం

సిరాన్యూస్‌, చిగురుమామిడి
రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం : ప్రొఫెసర్ కోదండరాం

భారత రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే మాత్రమే సాధ్యమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో కోదండరాం విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భారత రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ దేశంలో మతం పేరిట రాజకీయం చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని, దీనిని నిలువరించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన వెంట స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులు యోగేంద్ర యాదవ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు, టీజేఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి మోర గణేష్, టీజేఎస్ నాయకులు నీలవేణి రమేష్, ములుగు సతీష్, కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, కాంగ్రెస్ నాయకులు కవ్వంపెళ్లి సంజీవ్, జిల్లెల్ల రమేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *