సిరాన్యూస్, ఓదెల
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఓదెల మండలం కొలనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 2001-2002 పదవ తరగతిలో బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 22 ఏళ్ల తర్వాత అందరం ఒకే చోట కలుసుకున్నారు. విద్య నేర్పిన గురువులందరిని కూడా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రారెడ్డి, మల్లారెడ్డి, స్వర్ణలత, పుష్పలీల, క్యదాసి సారయ్య, మమ్మద్ కాలిక్, విద్యార్థులు, కొల్లూరి సురేష్, కారంగుల శ్రీనివాస్, గుండేటి మధు, పరిష శ్రీనివాస్, తోట నరేష్, మామిడి కుమార్, కొయ్యడ ప్రవీణ్, తుంగని తిరుపతి, తుంగానిశ్రీనివాస్, తోట సంతోష్ గ్యారవేణి రమేష్, గంట లక్ష్మణ్, పూర్వ విద్యార్థిలు తదితరులు పాల్గొన్నారు.