సిరాన్యూస్, భీమదేవరపల్లి
వీర్లగడ్డ తండా మంచి నీటి సమస్య తీరుస్తాం: కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
వీర్లగడ్డ తండా కు మంచి నీటి సమస్య తీరుస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా గ్రామ ప్రజల పిలుపు మేరకు ఆ గ్రామాన్ని కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆ గ్రామంలో మంచినీటి కోసం గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎంపీటీసీ భర్త శ్రీనివాస్. సర్పంచ్ తుక్రం నాయక్ వివరించారు. ఈ సమస్య ను ఎంపీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ,ఎలక్షన్ కోడ్ తరువాత సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, ప్రధానకార్యదర్శి గోదల సంపత్, మల్లారం ఎంపీటీసీ శ్రీనివాస్, వీర్లగడ్డ తండా సర్పంచ్ తుక్రం నాయక్, గుగులోత్ సంతోష్, వీరన్నా నాయక్, తదితరులు ఆ గ్రామస్తులు పాల్గొన్నారు.