సిరాన్యూస్, ఓదెల
చెరువు మత్తడిని పునర్నిర్మించాలి :బీజేపీ నాయకులు పులి కొమురయ్య
* తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతి
శానగుండ గ్రామంలో చెరువు మత్తడిని పునర్నిర్మించాలని బీజేపీ నాయకులు పులి కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కు ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడారు. ఓదెల మండలం షానగొండ గ్రామంలోని చెరువు మత్తడిని గత సంవత్సరం జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు డిటోనేటర్లు ఉపయోగించి ధ్వంసం చేశారన్నారు. సంవత్సర కాలం పూర్తయినా చెరువు పునర్నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో వందలాది రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మత్తడి విధ్వంసానికి కారకులైన దుండగులను విచారించి శిక్షిస్తామని, వారం రోజుల్లో మత్తడి పునర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు సమస్య పరిష్కారం కానందున తాము అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి చెరువు మత్తడి కి మరమ్మత్తులు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మేడుదుల రాజ్ కుమార్, ఎర్రవెల్లి అనిల్ రావు,మేకల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.