సిరా న్యూస్,కాకినాడ;
సామర్లకోట జాతరలో కొండచిలువల ను ఆడిస్తున్న ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైల్డ్ లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ప్రమాదకరమైన కొండ చిలువ లను జనాల్లోకి తీసుకుని వెళ్ళినందుకు చర్యలు తీసుకుంటున్నారు. మూడు కొండచిలువలను వారి దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.