సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్స్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ఎంఆర్ పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మాదిగలను కాంగ్రెస్ మోసం చేసింది చరిత్ర సాక్ష్యం… బీఆర్ఎస్ మోసం చేసింది చరిత్ర సాక్ష్యం… కానీ మాదిగలను హక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ. మాదిగలు కాంగ్రెస్ లో ఉన్న… బీఆర్ఎస్ లో ఉన్న ఏ పార్టీలో ఉన్న కమలం పువు గుర్తు పై ఓటేయాలని కోరారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది…. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే వర్గీకరణ సాధిస్తాం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి ఓటేసి గెలిపించాలని కోరారు.
===================