Kondaigedem akshinthalu: కొండాయిగుడెంలో ఇంటింటికి అక్షింతలు

సిరా న్యూస్, సూర్యపేట:

కొండాయిగుడెంలో ఇంటింటికి అక్షింతలు

సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండాయిగుడెంలో గ్రామంలో అయోధ్య రాములోరి అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేసారు. శనివారం ఈ మేరకు గ్రామస్తులు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామజన్మ భూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన అక్షింతలు, స్వామి వారి చిత్రపటాలను పల్లకిలో ఉంచి, గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలు, కోలాటాలతో శోభాయాత్ర ఘనంగా సాగింది. మహిళలు మంగళ హారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, సైది రెడ్డి, వీరయ్య, మధు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *