సిరా న్యూస్, చిగురుమామిడి
ఇతర గ్రామాల వారు పెయింట్ చేస్తే జరిమానా
* పెయింటర్ సంఘం గ్రామ అధ్యక్షుడు కొంకట రాజు
* బొమ్మనపల్లి పెయింటర్స్ సంఘం బోర్డ్ ఆవిష్కరణ
గ్రామంలో రిజిస్ట్రేషన్ అయిన సంఘం ఉన్నందున ఇతర గ్రామాల వారు గ్రామంలో పెయింట్ చేస్తే జరిమానా విధించడం జరుగుతుందని పెయింటర్ సంఘం గ్రామ అధ్యక్షుడు కొంకట రాజు అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం బొమ్మనపల్లి పెయింటర్స్ సంఘం (రిజిస్ట్రేషన్ నంబర్ ఏ/154/23) బోర్డ్ ను దర్గా వద్ద ఆవిష్కరించారు. ఈసందర్భంగా పెయింటర్ సంఘం గ్రామ అధ్యక్షుడు కొంకట రాజు మాట్లాడుతూ పిఓపి, గ్లాస్ పాలిష్, స్ట్రక్చర్, పుట్టి, డిజైన్స్, వెలివేషన్ డిజైన్స్ ఇతర అన్ని రకాల పెయింటింగ్ సంబంధించిన పనులు చెయ్యడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి పెయింటర్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గుజ్జుల తిరుమల రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంక ట రవి, కోశాధికారి కొంకట చిన్న రవి, సభ్యులు తల్లా దేవేందర్ మాతంగి జానీ, చంటి, కొంకట క్రాంతి, కొంకట సమ్మా రావు, మిట్టపల్లి సురేందర్, ఎర్ర పోచయ్య, తల్లా సంజీవ్, ఆదర్శ్, శంకర్, పిట్ట శ్రీనివాస్, కిరణ్, బీజ లక్ష్మీ పతి పాల్గొన్నారు.