ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో కొప్పల వెలమ కమ్యూనిటీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

సిరా న్యూస్,బోబ్బిలి;

త్వరలో జరగబోయే అసెంబ్లీ, మరియు లోక్సభ ఎన్నికల్లో, రాష్ట్ర జనాభాలో నాలుగవ స్థానంలో ఉన్న కొప్పుల వెలమ కమ్యూనిటీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ,అన్ని జనరల్ స్థానాల్లోనూ కొప్పుల వెలమ అభ్యర్థులకు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు కేటాయించాలని,ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.బొబ్బిలి లోకబందు రెసిడెన్సి లో జరిగిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ,35 లక్షలకు పైగా జనాభా కలిగిన కొప్పులు వెలమ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని,దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.మా హక్కుల కోసం అవసరమైతే మేము నిరసనలు రాస్తారోకాలు,దీక్షలు చేపడతామని అన్నారు.అన్ని జనరల్ కేటగిరీలలో కొప్పుల వెలమ సామాజిక వర్గ అభ్యర్థులకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని,లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి,అన్ని స్థానాల్లో ఇండిపెండెంట్ లుగా పోటీ చేసి,అన్ని స్థానాలు కైసం చేసుకుంటామని,అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించారు..
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *