సిరాన్యూస్, ఓదెల
పచ్చని తెలంగాణను ఎండగట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం
* మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* పార్టీ కోసం కలిసి కట్టుగా పని చేయాలి
* బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
పచ్చని తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శుక్రవారం ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. వారికి నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో మనమందరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం 100 సంవత్సరాలు గడిచిన తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎంతో ఉంది. గోదావరి నీళ్లు ఓడిసిపట్టి రైతులందరికీ సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలో అర్హులైన వారికి అందించామని తెలిపారు. చేనేత కార్మికులను ఆకలి చావుల నుండి కాపాడిన ఘనత కేసీఆర్ దే తెలిపారు. ఆర్ గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చనైన తెలంగాణను ఎండ కట్టిందని, ఈ ప్రభుత్వం సాగునీరు లేదు తాగునీరు లేదు కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారాన్ని ఇస్తానన్న ప్రభుత్వం తుంగలో తొక్కినారని ఆరోపించారు. రైతు బంధు ఊసే లేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మన ఆత్మ గౌరవాన్ని మన పార్టీని గెలిపించుకుందాం అని అన్నారు.పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వందరోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని పార్లమెంటు ఎన్నికలతో మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి మనం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరంగా చెప్పి ఓటు అడగాలని సూచించారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండదు ప్రతి కార్యకర్త పార్టీ కోసం కలిసి కట్టుగా పని చేయాలని ఆయన అన్నారు. ఓదెల జెడ్పిటిసి గంట రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇసుక దోపిడీ ఆగటం లేదని ఆరోపించారు. రైతులకు సాగు తాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు…దేశంలోనే అత్యధిక ధనవంతుల్లో 9వ స్థానం వివేక్ కుటుంబానిదని అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెడ్పిటిసి గంట రాములు ఎంపీపీ కూనారపు రేణుకా దేవి .వైస్ ఎంపీపీ జీల తిరుపతి. మాజీ ఎంపీపీ బుద్ధ రామస్వామి. పోశెట్టి. టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్ .మేడగొని శ్రీకాంత్, ఓదెల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి, కనక రెడ్డి సతీష్. చింతం వెంకటస్వామి మొగిలి, బోడకుంట నరేష్, శ్రావణ్. మాజీ సర్పంచులు పులుగు తిరుపతిరెడ్డి, ఉప్పుల సంపత్ కుమార్, శ్రవణ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు