Koppula Ishwar: కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలే : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

సిరాన్యూస్‌, ఓదెల
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలే : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* ఓదెలలో  రోడ్ షో

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేన‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లోక స‌భ‌ ఎన్నికలు దగ్గర పడుతున్న వేలా పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం ఉదయం ఓదెల మండల కేంద్రంలో రంగు దుకాణం సెంటర్ దగ్గర రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గత 40 సంవత్సరాలు సింగరేణి కార్మికునిగా పనిచేశాను. లోకల్ గా ఉన్నాను, ఎవరికి ఏ బాధ వచ్చినా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు, తాగునీరు కరువైందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీరు తాగునీరు కు కరువే లేదా అని అన్నారు . రోడ్ షో కార్యక్రమంలో పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే హరిత మిత్ర అవార్డు గ్రహీత దాసరి మనోహర్ రెడ్డి, ఓదెల. జడ్పిటిసి గంట రాములు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఐ రెడ్డి వెంకటరెడ్డి, కోపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ జీల తిరుపతి ఓదెల గ్రామ బీఆర్ఎస్ నాయకులు పోలోజు రమేష్ , బుద్దే కుమారస్వామి , డాక్టర్ కనీకి రెడ్డి సతీష్, బోయ సదానందం, సూత్రాల శ్రావణ్, రాచర్ల కుమార్, చింతం వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *