సిరా న్యూస్, చిగురుమామిడి
కులగణన చేపట్టడం హర్షిణీయం
* మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల వర్గాల కుల గణన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం హర్షణీయమని చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,విశ్వకర్మ పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే అనగారిన కులాలను వాడుకున్నారే తప్ప… న్యాయం చేయలేదన్నారు.కుల గణన ద్వారా వెనుకబడ్డ కులాల్లో సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.