kotta Narayana Reddy: సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

సిరా న్యూస్, సైదాపూర్
సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
* భూదాత‌కు స‌న్మానం
సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ర‌హ‌దారి కోసం కొత్త నారాయ‌ణ భూమిని విరాళ‌నంగా ఇచ్చారు. ఈవ్యవసాయ భూమిని కీ”శే శ్రీ కొత్త పద్మనాభ రెడ్డి జ్ఞాపకార్థం అందించిన‌ట్లు కుటుంబ సభ్యులు కొత్త సుశీల దేవి , వారి కుమారులు కొత్త నారాయణరెడ్డి, రాజిరెడ్డి, నాగిరెడ్డి,తిరుపతిరెడ్డి లు తెలిపారు. శ‌నివారం వ్యవసాయ భూమి నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో భూదాత కొత్త నారాయణరెడ్డి,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్, సైదాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసరి రఘు యాదవ్, నాయకులు తీగల రఘుపతి, గుర్రం శ్రీనివాస్, ఎండి చోటే గోపగొని సమ్మయ్య, మరి వేణు, గౌడ సంఘం అధ్యక్షులు గుర్రం సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *