సిరా న్యూస్, బోథ్
వివేకానంద స్కూల్లో ఉగాది సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల గల వివేకానంద స్కూల్ ఇ/మీ లో సోమవారం ముందుగానే ఉగాది సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య ఉగాది పండగ యొక్క విశిష్టతను, ప్రకృతిలో జరిగే మార్పులను గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా షడ్రుచులతో తయారు చేసినటువంటి పచ్చడిని విద్యార్థులకు వితరణ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్నేహిక,రజిని, సౌమ్య, నిత్య, దివ్య, ప్రవలిక, సుష్మ, విద్యార్థులు పాల్గొన్నారు.