సిరాన్యూస్, బోథ్
వివేకానంద స్కూల్లో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల లోగల వివేకానంద స్కూల్ ఇ/మీ లో శనివారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చేసినటువంటి కృషిని, వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలను,అవమానాలను విద్యార్థులకు తెలియజేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య,యాజమాన్య సిబ్బంది ఓరుగంటి ఇస్తారి, కోస్మెట్ శుద్దోధన్ ఉపాధ్యాయులు స్నేహిక, రజిని, సౌమ్య, నిత్య, దివ్య, ప్రవలిక, సుష్మ, విద్యార్థులు పాల్గొన్నారు.