Krishna water : ఒక్కరోజుకే ఆగిపోయిన కృష్ణానీరు

సిరా న్యూస్,తిరుపతి;
సీఎం జగన్ మోహన్ రెడ్డి హంద్రీనీవా కాలువ దగ్గర ప్రత్యేక పూజలు చేసి… కృష్ణా జలాలను కుప్పంకి తరలించారు. ఇలా తమ ప్రభుత్వం మాత్రమే చేసిందని తెలిపారు. ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ నేతలు, శ్రేణులూ నిన్నంతా సంబరాలు చేశారు. సొంత నియోజకవర్గమైనా, కుప్పంలో చంద్రబాబు చేసిందేమీ లేదనీ, తాము మాత్రం కుప్పంకి అన్నీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. తీరా చూస్తే.. కాలువను ప్రారంభించిన 24 గంటల్లోనే హంద్రీనీవా కాలువలో నీళ్లు ఆగిపోయాయి.
ఏర్పాటు చేసిన గేట్లను తొలగించేశారు అధికారులు. కాలువలో నీరు లేకపోవడంతో.. అందులోకి దిగిన టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇదేనా ఎన్నికల వాగ్దానం? ఇదేనా సీఎం జగన్ హామీ అంటూ ఆందోళన చేపట్టారు.హంద్రీనీవా నీటి వ్యవహారం టీడీపీ – వైసీపీలకు రాజకీయ ఆయుధంగా మారింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ, వైసీపీ ది షోఅప్ అంటున్న టీడీపీ. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా కుప్పంలో పర్యటించిన సీఎం హంద్రీనీవా నీటిని కుప్పంకు అందించడంతో హంద్రీనీవా ఇష్యూ హాట్ టాపిక్ గా మారిపోయింది.కాలువలో నీరు లేవని చెప్పేందుకు తామే నిదర్శనం అని వారు అంటున్నారు. కాలువలోనే తాము కూర్చున్నామనీ, ఇంతకంటే రుజువు ఏం కావాలని వారు అంటున్నారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వట్లేదు. ఎందుకు గేట్లను తొలగించారో, ఎందుకు నీటి విడుదలను ఆపేశారో స్ఫష్టం చెయ్యలేదు. ఒక్కరోజులోనే ఇలా జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మాత్రం దానికి ఇంత హంగామా చెయ్యాలా? భారీగా ఏర్పాట్లు చేసి, ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల స్టంట్ అని అంటున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందిస్తే గానీ ఎందుకు నీరు ఆపేసిందీ తెలిసే అవకాశం లేదు,672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకొచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పంకు నీళ్లు ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా మన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు కుప్పంకు నీళ్లు తీసుకుని రాలేదని ప్రశ్నించడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భమన్న సీఎం ఎంతో గర్వపడుతున్నా నన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారని ఇది వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు..కుప్పంలో ఒక టిఎంసి సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను రూ. 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్నారు. అదనంగా మరో 5 వేల ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని, 35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎంగా ఎన్నికైన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని సీఎం ప్రశ్నించారు. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడు వల్ల రాష్ట్రానికి ఏమి ప్రయోజనం జరుగుతుందన్న సీఎం. తనకు భారీ వాటాలు ఇచ్చే వారికే ఈ ప్రాజెక్ట్ పనులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడన్నారు. ఎంతో చిత్తశుద్దితో ఈ పనులు మేము పూర్తి చేశామన్నారు సీఎం జగన్.ఇక కుప్పంలో సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ ఇస్తోంది. కుప్పంకు హంద్రీనీవా క్రెడిట్ తమాడేనంటున్న వైసీపీపై మండిపడుతోంది. కుప్పంకు హంద్రీనీవా జలాలు నేనే తెచ్చా అంటూ ప్రజలకు బూటకపు మాటలతో మోసం చేయవద్దని సీఎంకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. టీడీపీ ప్రభుత్వంలో వందల కిలోమీటర్లు కాలువ తవ్వి కుప్పంకు జల నిధిని అందించే ప్రయత్నం చంద్రబాబు చేశారన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 30 కిలోమీటర్లు కూడా కాలువ తవ్వలేక పోయారని ఆరోపించారు టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.పోలవరం ప్రాజెక్టును విస్మరించి కుప్పంకు నీళ్లు తీసుకురావడం సాధ్యమా అని ప్రశ్నించిన అమర్ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ మాటల గారడీ చెయ్యొద్దన్నారు. జగన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కుప్పం అభివృద్ధి పేపర్ ప్రకటనకే పరిమితం అయ్యిందన్నారు. సీఎంగా చంద్రబాబు పులివెందులకు సైతం నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖపై అవగాహన లేక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నా మాజీ మంత్రి వైఫల్యాలను జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లపాటు రివర్స్ గేర్ లో నడిచిన వైసీపీ సర్కార్ పర్యవసానంగా జగన్ కు రిటర్న్ గిఫ్ట్ కు కుప్పం ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *