సిరాన్యూస్, కుందుర్పి
తాగు నీరు అందించడమే తలారి రంగయ్య లక్ష్యం
* ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షులు కృష్టపురం బాబు
నీరు లేని పల్లె గ్రామాలకు తాగు నీరు అందించడమే అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య లక్ష్యంగా ముందుకెళ్తున్నారని ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షులు కృష్టపురం బాబు అన్నారు.శనివారం కుందుర్పి మండలం లోని తూముకుంట పంచాయతీ, కృష్టపురం గ్రామంలో తలారి రంగయ్య నుంచి మంజూరైన నిధుల ద్వారా బోర్ పాయింట్ లను వేశారు. నీరు పుష్కలాగా పడ్డాయని తెలిపారు. దాంతో గ్రామం లోని ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ తలారి రంగయ్య ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. కార్యక్రమంలో డీలర్ తిమ్మప్ప, సీనియర్ నాయకులు నాగభూషణ వాలెంటీర్స్ మారుతీ, బాబు వైఎస్ఆర్సీపీ నాయకులు,ధనుంజయ మరి స్వామి మహేష్ జి బాబు లక్ష్మీకాంత చంద్రప్ప మోహన్ బాబు పాల్గొన్నారు.