kshma Deshpande: మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి

సిరాన్యూస్‌, జైన‌థ్‌
మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి
* జిల్లా సీనియ‌ర్ జ‌డ్జి క్ష‌మా దేశ్‌పాండే
మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని జిల్లా సీనియ‌ర్ జ‌డ్జి , లీగ‌ల్ సెల్ అథారిటీ సెక్రెట‌రీ క్ష‌మా దేశ్‌పాండే
అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్‌లోని పిప్ప‌ర్‌వాడ ఉన్న‌త పాఠ‌శాల‌లో మంగ‌ళ‌వారం మ‌హిళ దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా జిల్లా సీనియ‌ర్ జ‌డ్జి , లీగ‌ల్ సెల్ అథారిటీ సెక్రెట‌రీ క్ష‌మా దేశ్‌పాండే హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా మ‌హిళ‌ల హ‌క్కుల గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ లింగ వివ‌క్ష‌ను విడ‌నాడి మ‌హిళా సాధికార‌త సాధించే విధంగా ముందడుగు వేయాల‌న్నారు. మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో సామాజిక‌, రాజ‌కీయ, ఆర్థిక రంగాల‌లో పురోభివృద్ది సాధించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానోపాధ్యాయులు శ‌శిక‌ళ‌, ఉపాధ్యాయులు రాకేష్‌, అభ‌న్‌కుమార్‌, రామేశ్వ‌ర్‌, స్వాతి, అనిత‌, ప్రాథ‌మిక పాఠ‌శాల ఉపాధ్యాయులు రాధిక‌, న‌వ‌నీత‌, ఎలిజ‌బెత్‌, అంగ‌న్‌వాడీ టీచ‌ర్ వ‌సంత‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *