KSR Prajaseva Bhavan: సీనియర్‌ నాయకులు కాంగ్రేస్‌లోకి రావడం హర్షణీయం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

సీనియర్‌ నాయకులు కాంగ్రేస్‌లోకి రావడం హర్షణీయం
+ కాంగ్రేస్‌ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి
+ ప్రజాసేవా భవన్‌లో కొత్త నాయకులకు ఆత్మీయ సన్మానం
+ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

కాంగ్రేస్‌ పార్టీలోకి సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు చేరడం చాలా సంతోషంగా ఉందని, కాంగ్రేస్‌ పార్టి నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆదిలాబాద్‌ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు కొత్తగా చేరిన నాయకులకు ఆత్మీయ స్వాగతం ఏర్పాటు చేసారు. వారికి పూలబొకేలు అందించి, శాలువాలతో సత్కరించారు. ఇటీవల ఆదిలాబాద్‌ ఇంచార్జి మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, జెనథ్‌ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్‌ రెడ్డి, పూసాయి సర్పంచ్‌ ఎడ్మల పోతారెడ్డి, తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అంతా కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ హయాంలో అంతగా అభివృద్ధి జర్గలేదని, ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఆరుగ్యారంటీలను పక్కాగా అమలు చేసి అర్హులైన ప్రజలందరికి ప్రభుత్వ సంక్షేమఫలాలు అందేలా కృషీ చేస్తామన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ… పార్టీ బలోపేతం కోసం కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. అంతా సమిష్టిగా పనిచేసి రానున్న పార్ల మెంట్‌ ఎన్నికలలో పార్టీ విజయానికి కృషీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, నాయకులు తుమ్మల వెంకట్‌ రెడ్డి, ఎడ్మల పోతారెడ్డి, దశరథ్‌ రామ్‌ రెడ్డి, శ్రీనివాస్, రెడ్డిజగదీష్‌ రెడ్డి, లింగారెడ్డి, గడ్డం పోతారెడ్డి, కృష్ణ రెడ్డి, మోహిన్‌ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *