సిరా న్యూస్,ఖమ్మం;
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్స్ చేయి చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని రాష్ట్ర గిడ్డంగలు సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు..ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనంచేశారు..
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేటిఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు..ఆడవాళ్లు బస్సుల్లో కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటి, సమయం వృధా చేయకుండా పనిచేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు.. కేటీఆర్ పై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు కేసు నమోదు చేయాలని కోరారు.. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పిన మీకు బుద్ధి రావట్లేదు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు..ఇప్పటికైనా మీ అహంకారమైన మాటలు మానుకోని మహిళలకు బహిరంగ క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు..