Kuchalapur:అనుమానాస్ప‌ద‌స్థితిలో యువ‌కుడు మృతి

సిరాన్యూస్‌,బోథ్‌
అనుమానాస్ప‌ద‌స్థితిలో యువ‌కుడు మృతి

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కుచలాపూర్ గ్రామానికి చెందిన బి. అరవింద్ (28) అనే యువకుడు అనుమానాస్పద‌స్థితో మృతి చెందాడు. ఎస్సై బి. రాము తెలిపిన వివ‌రాల‌ ప్రకారం… బి. అరవింద్ ఈనెల 6న ఉదయం ఇంటి నుండి వెళ్లాడు. సాయంత్రమైన‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆయన కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కుమారుడు ఆచూకీ దొర‌క‌పోవ‌డంతో తండ్రి లక్ష్మణ్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దాదాపు 15 రోజులు కుటుంబీకులు వెతికిన దొరకకపోగా సోమ‌వారం గ్రామం సమీపంలోని ఓ చేన్లో శ‌వ‌మై కనిపించాడు. పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కుక్కలు తిరిగివేశాయి. అయితే సోమవారం మధ్యాహ్నం పూట చేను యజమాని జొన్న పంటకు నిప్పు పెడుతున్న సమయంలో కుక్కలు శవాన్ని తినడం చూసి గ్రామంలో తెలపడం జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి సిఐ రమేష్ తో పాటు ఎస్ఐ రాము చేరుకున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *