Kuchalapur: కుచ‌లాపూర్‌లో కదం తొక్కిన బీడీ కార్మికులు

సిరాన్యూస్‌,బోథ్‌
కుచ‌లాపూర్‌లో కదం తొక్కిన బీడీ కార్మికులు
* బీడీ పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
* ఐఎప్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న

బీడీ పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని బీడీ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలంలోని కుచు లాపూర్ గ్రామంలో బీడీ కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల వేత‌నాల‌ పెరుగుదల కార్మికుల విజయమని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి ఇచ్చేది బీడీ తయారీతోనేనని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు సరైన పని లేక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. పరిశ్రమ రోజురోజుకు నిర్వీర్యం అవుతున్నదని, తక్కువ వేతనాలతో పనులు చేయాల్సి వస్తుంది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల ఆదుకోవాలని అన్నారు. బీడీ కార్మికులందరికీ లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజు, ఆడేల్లు, సంతోష్, శోభ, ఎం రాజేందర్, గోదారి, బాయ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *