కుదేలయిన వైకాపా

సిరా న్యూస్,అమరావతి;
ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ధాటికి వైసీపీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమి బాటలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరా జు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్ర నాథ్రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఉష శ్రీచరణ్ తదితరులు వెనుకంజలో కొనసా గుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోం ది. మరోవైపు జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందం జలో ఉన్నారు. తూర్పుగోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10లో 6 చోట్ల లీడ్లో కొనసాగుతున్నా రు. కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలు లో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10 శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కి 13, విజయనగ రంలో 9కి 8, పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్లో కొనసాగుతున్నా రు.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *