సిరా న్యూస్,హుజురాబాద్;
తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా మరియు మండల కమిటీ
నిర్మాణం లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి యువజన నాయకుడు కుడికాల సాయి హుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు గా తెలంగాణ ఐక్యవేదిక చేనేత రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ సోమవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం చేనేత కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తన నియమకం కోసం కృషి చేసిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి జడల చిరంజీవి కి కృతజ్ఞతలు తెలిపారు.