Kumaraswamy:రైతు వేదిక…ప్రభుత్వ మార్కెట్ ఏది..!

సిరా న్యూస్,ఓదెల
రైతు వేదిక…ప్రభుత్వ మార్కెట్ ఏది..!
* ఇబ్బందులు ప‌డుతున్న రైతులు
* రైతుబిడ్డ బుద్దే కుమారస్వామి
మండ‌లంలో రైతు వేదిక‌.. ప్ర‌భుత్వ మార్కెట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలంగాణ ఉద్యమకారుడు రైతుబిడ్డ బుద్దే  కుమారస్వామి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓదెల మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఐదు గ్రామాలలో రైతు వేదికలు నిర్మించారని తెలిపారు. కొలనూరు, గుండ్లపల్లె, పోత్కపల్లి, గుంపుల, ఓదెల గ్రామాల్లో 22 లక్షల వ్యయంతో అద్భుతంగా రైతు వేదికలు నిర్మించారని పేర్కొన్నారు.ఓదెల రైతు వేదిక వద్ద అంతకుముందు మార్కెట్ స్థలం ఉండేది. కానీ ఈ స్థలంలో డబుల్ బెడ్ రూములు నిర్మించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఓదెలలో మార్కెట్ లేక రైతులు పండించిన పంటలను అమ్మటానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు . ప్రైవేటు రైతుల స్థలాల్లో కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు . ఓదెల మండల కేంద్రంలో రైతులకు అనుకూలంగా ప్రభుత్వ మార్కెట్ నిర్మించాలని రైతులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *