సిరా న్యూస్,భీమదేవరపల్లి
ఆత్మరక్షణ కోసమే కరాటే
* ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి
ఆత్మరక్షణ కోసమే కరాటే అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి అన్నారు. మంగళవారం గట్ల నర్సింగాపూర్ శ్రీ గుండవరం సత్యవతి శ్రీనివాస రావు జిల్లా పరిషత్ పాఠశాలలో కరాటే క్లాసుల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గత మూడు నెలల నుంచి కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ యోగ క్లాసులు కోసం రవళి ఆధ్వర్యంలో పాఠశాల బాలికలకు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. గత మూడు నెలల నుంచి వారు నేర్చుకున్నటువంటి సహస కృత్యాలు ఉపాధ్యాయులు ,విద్యార్థుల ముందు ప్రదర్శించారు. ఈ ఆత్మ రక్షణ క్రీడా బాలికలకు వాళ్ళ ముందు భవిషత్తులో చాలా బాగా ఉపయోగపడుతుందనీ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ రెడ్డి, పాఠశాల పిఈటి ఉమా,కోచ్ రవళి పాల్గొన్నారు.