సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అపన్న హస్తం కోసం ఎదురుచూపు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అశోక్ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన కుందూరి రాజు, భార్య శోభ దంపతులకు ఒక కూతురు రాజ్యలక్ష్మి ఉన్నారు. కుందూరి రాజు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కుందూరి రాజు ఊపిరితిత్తులు, లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం సుమారు 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజు కూలి పని చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలు కాపాడాలని భార్య శోభ వేడుకుంటుంది. ఎవరైనా సహాయం చేసేవారు ఈ ఫోన్ నెంబర్ కు. 9908385381 . కు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాలని కంటతడి పెట్టుకుంటూ వేడుకుంటున్నారు.