సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పిలో మహాత్మ గాంధీజీ జయంతి వేడుకలు
మండల కేంద్రమైన కుందుర్పిలో జాతిపిత గాంధీజీ జయంతి వేడుకలను స్థానిక గ్రామ సర్పంచి మారుతీశ్వరి రామమూర్తి, ఎంపీటీసీ గంగమ్మ హనుమంతరాయుడు, వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ తనయుడు ఆలూరు నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక సచివాలయంలో సర్పంచ్ అధ్యక్షతన, డిజిటల్ అసిస్టెంట్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా పలువురు గాంధీజీ దేశానికి చేసినటువంటి త్యాగంపై ప్రసంగించారు. ఎమ్మార్సీ ఆవరణంలో ఉన్న జాతిపితి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మంజునాథ్, వార్డ్ మెంబర్ వైబి దుర్గమ్మ తనయుడు వైబి హనుమంత రాయుడు , జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబు, మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ లక్ష్మణమూర్తి , స్కూల్ కమిటీ చైర్మన్ రాఘవేంద్ర, మాజీ జడ్పిటిసి రాజగోపాల్, టి రాజు, గంగన్న , తిప్పయ్య, అనుమేష్, కే నాగేంద్ర, లక్ష్మణమూర్తి, ఎస్ నాగేంద్ర, రేవన్న, సచివాలయ సిబ్బంది గురు, సుధా లక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు.