సిరా న్యూస్, కుందుర్పి
కుందుర్పిలో విద్యాసంస్థలు బంద్ విజయవంతం
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా కుందుర్పి మండలంలో నిర్వహించిన విద్యాసంస్థలు బంద్ విజయవంతమైంది. ఈసందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష విధానాన్ని రద్దుచేసి కొత్తగా రాష్ట్రాలకు కూడా పరీక్షలు పెట్టే అధికారం ఇవ్వాలని అన్నారు. పేపర్ లీకేజ్ కి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.