కుందుర్తి, సిరా న్యూస్
కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో తెనిగేల్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి ఈ ప్రమాదంలో ఐదుగురికి త్రీవ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ సిలిండర్ పేలిన చప్పుడుకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రమాదం తీవ్రతతో అక్కడున్న వారు భయాందోళన వ్యక్తం చేశారు.