— సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ, కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్.
— కామ్రేడ్ ఎం.వి. ప్రసాద్, వసంతక్కల 19 వ వర్ధంతి కరపత్రాల ఆవిష్కరణ
సిరా న్యూస్,హైదరాబాద్;
గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో కామ్రేడ్ ఎం.వి.ప్రసాద్, వసంతక్కల లాంటి ఎందరో నిరాయుదులైన విప్లవకారులపై కొనసాగించిన నరహంతక హత్యా రాజకీయాలు, బెదిరింపులు, బౌతిWQక దాడులు, రాజకీయ తప్పిదాలపై జనశక్తి కూర రాజన్న నేడయిన నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకొని, విప్లవ ప్రజానీకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ, కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లెప్రబాకర్ ప్రసంగిస్తూ కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి నిర్మించిన గోదావరిలోయ విప్లవ ప్రతిఘనోద్యమం పెడదోవ పట్టి, బలహీన పడడానికి, వివిధ సంస్థల విచ్చిన్నతకు కారకుడు జనశక్తి కూర రాజన్న అని ఆరోపించారు. దోపిడీ, పీడన, అణిచివేత లేని సమసమాజ స్థాపన కొరకు వందలాది మంది కామ్రేడ్స్ తమ ఆత్మ బలిదానాలతో బలమైన సిపిఐ(ఎం.ఎల్) పార్టీగా నిర్మితం అవుతున్న క్రమంలో ఆతను అనుసరించ విప్లవ వ్యతిరేక అన్యవర్గదోరణులు భారత విప్లవాన్ని తీవ్రంగా నష్టపర్చాయని అన్నారు. నేటికీ ప్రతిఘటన పోరాటం అనేక నిర్భందాలను, ఆటుపోటులను ఎదుర్కొంటున్నదని గుర్తు చేశారు. రాజకీయ, సైద్ధాంతిక, నిర్మాణ పరమైన అంతర్గత పోరాటంలో నిలబడలేక, విప్లవ సంస్కృతిలో రౌడీయిజం, గుండాయిజాన్ని చొప్పించారని అన్నారు. తనను ప్రశ్నించి, వ్యతిరేకించేవాళ్ళను సాయుధ ముఠా హత్యా రాజకీయాలకు, దాడులకు గురిచేసేవారని వెల్లడించారు. పార్టీలో ముందుకు వచ్చిన ప్రజస్వామిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన రాజన్న, విప్లవ వ్యతిరేకులు, అరాచకాలు, ఇన్ ఫార్మర్ల పేరిట అంతమొందించే సంస్కృతిని పెంచి, పోషించారని అన్నారు. ఇప్పటికైన ఎం.వి. ప్రసాద్, వసంతక్కల 19 వర్ధంతి సందర్భంగా ఆత్మవిమర్ష చేసుకోవాలని సూచించారు. కామ్రేడ్ సిపిరెడ్డి లాంటివారే తను చేసిన రాజకీయ, నిర్మాణ, వ్యక్తిగత తప్పిదాలపై బహిరంగంగా ఆత్మవిమర్ష చేసుకొంటూ విమోచన పత్రికలో ప్రచురించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. అలాంటి సిపిరెడ్డికి నిజమైన వారసుడిగా నిలబడి, విప్లవ అభిమానులకు, ప్రజానీకంకు క్షమాపణలు చెప్పి, విప్లవ నిబద్దతను చాటుకోవాలని కోరారు. ఎం.వి.ప్రసాద్, వసంతక్కలతో పాటు ఇప్పటిదాకా బౌతిక దాడులల్లో మట్టుబెట్టిన వారందరికి విప్లవ జోహార్లు అర్పించాలని, లేనియెడల కూర రాజన్నను చరిత్ర క్షమించదని హెచ్చరించారు. అనంతరం 2024, జూన్-18 నుండి 25 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రసాదన్న, వసంతక్కల 19వ వర్ధంతి సభలను ఘనంగా నిర్వాహించాలని పిలుపునిస్తూ కరపత్రాలను ఆవిష్కరించారు. మల్లెపల్లి ప్రబాకర్ తో పాటు ఈపై కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు.(శ్రామిక స్పందన) జాతీయ కార్యదర్శి షేక్ షావలి, భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు, భారత ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ, రాష్ట్ర కార్యదర్శి పెర్క సునీత, తదితరులు పాల్గోన్నవారిలో ఉన్నారు.