సిరా న్యూస్, జైనథ్:
కూర వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి నిర్వహించారు. శనివారం ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల దర్శనార్థం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.