సిరాన్యూస్, ఆదిలాబాద్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
* బీజేపీకీ వ్యతిరేకంగా ఓటు వేయడమే నిజమైన దేశ భక్తి
* సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కీ వ్యతిరేకంగా ఓటు వేయడమే అసలైన దేశభక్తి అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్ పిలుపునిచ్చారు . ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టెలా కార్మిక చట్టాలను బీజేపీ చేసిందన్నారు.అదానీ , అంబానీల ఆస్తులు పెంచి ఆకలి సూచీలో దేశాన్ని 111 వ స్థానంలో నిలిపిందని ఆరోపించారు. 104 కోట్ల మంది పేదలు దారిద్య్రంలో ఉన్నారని ఐక్య రాజ్యసమితి పేర్కొన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు . మతాల మధ్యన చిచ్చు పెట్టి అన్నదమ్ముల కలిసి ఉన్న దేశ పౌరులను విడదీసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అల్లర్లు సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందే కుటిల నీతికి పాల్పడుతున్నవని మండి పడ్డారు . ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన బీజేపీ పై కనీసం కేసు నమోదు కాదు కానీ ప్రతిపక్షాలను ఈడీ నీ ఉసికొల్పి అరెస్టులు చేయిస్తుందని విమర్శించారు . లిక్కర్ మాఫియా నుండీ 55 కోట్ల రూపాయలు బీజేపీ కీ ముట్టాయి అని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక ,రైతు ,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ నీ దేశభక్తులైన దేశ పౌరులు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు . సమేవేశంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న , జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, జిల్లా కోశాధికారి కె.సునీత, జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ , ఎం .గంగన్న , డి.వెంకటమ్మ , లింగాల చిన్నన్న కార్యదర్శులు ఎం.సుజాత, అగ్గిమల్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.గంగయ్య, మామిడి స్వామి తదితరులు పాల్గొన్నారు.