సిరా న్యూస్, ఆదిలాబాద్
అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి
బోథ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుష్బూ గుప్తా
రానున్న పార్లమెంట్ ఎన్నికలను అధికారులు సమన్వయంతో పనిచేసే విధులు నిర్వహించాలని బోథ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుష్బూ గుప్తా పేర్కొన్నారు. గురువారం బోత్ తాసిల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బోథ్ నియోజకవర్గస్థాయి రెవెన్యూ మండల పరిషత్ పోలీస్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా రోడ్లలోని అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పోలింగ్ కేంద్రాల్లోని సమస్యలను గుర్తించాలన్నారు. అంతేగాక సమస్య ఆత్మకమైన గ్రామాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలను సంబంధిత పోలీసు అధికారులతో కలిసి చర్చించాలన్నారు. గ్రామాల్లోకి వెళ్లిన అధికారులు పోలింగ్ స్టేషన్లో ఉన్న వసతులను పరిశీలించడంతోపాటు పోలింగ్ స్టేషన్ల మధ్య ఏ మేరకు దూరం ఉందనేది గమనించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వసతులను పరిశీలించాలని, ముఖ్యంగా ఎన్నికలు ఎండాకాలంలో జరగనున్నందున త్రాగునీటి వసతి ఉందా లేదా అనేది పరిశీలించాలన్నారు. మరోవైపు గ్రామాలలోకి ఎన్నికల సిబ్బంది వెళ్లేందుకు సరైన రోడ్డు వసతి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. గతంలో విధులు నిర్వహించిన అధికారులు అనుభవంతో ఎన్నికలను సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఓటర్ జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, ఏమైనా అనుమానాలు ఉంటే మరోసారి పరిశీలించాలని సూచించారు. పోలీస్ అధికారులు సైతం సమస్మాత్మక గ్రామాలలో ముందస్తు సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తాసిల్దార్లు , ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు హాజరయ్యారు.