సిరాన్యూస్ , బేల
అధికారులు సమన్వయంతో పని చేయాలి: అడిషనల్ డీఆర్డీఓ కుటుంబరావు
వచ్చే వర్షాకాలంలో ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కార్యదర్శి సమన్వయంతో పని చేయాలని అడిషనల్ డిఆర్డిఓ కుటుంబరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గురువారం అడిషనల్ డిఆర్డిఓ కుటుంబరావు, ఆగ్రో ఫారెస్ట్ ప్లాంటేషన్, ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను పెంచాలని, ప్రతి గ్రామంలో మొక్కలను పంపిణీ చేయాలన్నారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. నాటిన మొక్కను బతికించాలని వారు సూచించారు. మొక్కల బాధ్యత, సంరక్షణ ప్రతి ఒక్క కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లదే అని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో మహేందర్,ఈసీ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.